KRNL: ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో సర్పంచ్ సరళమ్మ ఆధ్వర్యంలో ఆదివారం మురికి కాలువలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో కాలువలను శుభ్రపరచి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు. అంటువ్యాధులు, దోమలు ప్రబలకుండా గ్రామస్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.