కోనసీమ: మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే తక్షణమే సమాచారం అందించాలని ఆయన తెలిపారు.