KDP: వీరప్ప నాయన పల్లె మండలం తలుపనూరులో కొలువై ఉన్న గంగమ్మ అమ్మవారికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నాగిరెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.