NLR: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ఉదయగిరిలో ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి MRO కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం MROకు వినతిపత్రం అందజేస్తారన్నారు.