SKLM: ఆమదాలవలస పట్టణంలోని పాల పోలమ్మ ఆలయంలో భవాని దీక్ష శనివారం ఏకాదశి సందర్బంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ దీక్షను గురుస్వామీ పాతినా రమణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామీ మాట్లాడుతూ.. 41 రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భక్తులు ఆచార నియమాలను పాటించాలి అని అన్నారు.