AP: శ్రీకాకుళం తొక్కిసలాట ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మరణించివారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు పీఎంఓ ‘X’లో పోస్ట్ చేసింది.