కోనసీమ: జిల్లాలో ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం ఆదివారం సూచనలు చేశారు. పాఠశాల ప్రారంభ సమయానికి కనీసం 5 నిమిషాల ముందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలన్నారు. ప్రతిరోజూ పాఠశాల అసెంబ్లీలో, ఖాళీ పీరియడ్లలో విద్యార్థులకు నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇవ్వాలని తెలిపారు.