E.G: బ్రిడ్జిపేట 14వ వార్డులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ బుధవారం కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేశ్ బాబు, రాష్ట్ర రైతు విభాగ నాయకుడు పరిమి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.