ATP: హిందూపురం నుంచి మంగళగిరికి ఎద్దుల బండి యాత్ర చేపట్టిన యువరైతు నవీన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు మూడు రోజులుగా ఎదురుచూస్తున్నారు. హిందూపురం మండలం శాసనకోట గ్రామానికి చెందిన ఆయన నెల రోజుల క్రితం యాత్ర ప్రారంభించి అనంతపురం, నంద్యాల జిల్లాల మీదుగా మంగళగిరికి చేరుకున్నారు.