అన్నమయ్య: బి.కొత్తకోట మండలంలో మంగళవారం మహిళా అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ జీవన్ తెలిపారు. గుమ్మసముద్రం పంచాయతీ, గుడ్లవారిపల్లికు చెందిన జనార్ధన్ భార్య దాసరి విజయనిర్మల(34) ఇంట్లోనే ఆపస్మారకస్థితిలో పడిఉండగా కుటుంబీకులు గమనించి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. డాక్టర్లు పరీక్షిస్తుండగా ఆమె మృతి చెందిందన్నారు.