ప్రకాశం: తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ఈనెల 30 నుండి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నది. కాగా ఇవ్వాలా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతులు మీదుగా సంబంధిత వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. విన్నర్స్కి వరుసగా రూ.70వేలు, రూ. 50వేలు, రూ. 30వేలు, రూ.10వేలు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.