TPT: డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఈనెల 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు (ఫోన్ నం.0877- 2263261) టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు తెలపాలని అధికారులు కోరారు. కావున ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.