ప్రకాశం: ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ హర్ష వర్ధన్ తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.