ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.8.87లక్షల చెక్కులను 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.