NTR: విజయవాడలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బావాజీ పేటలో నివాసముంటున్న లీలకుమారి అనే మహిళ ఇటీవల హైదరాబాద్ వెళ్లి ఈనెల 25వ తేదీన తిరిగి వచ్చింది. వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన రూ.30 వేల నగదు, సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.