NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో శనివారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పి.అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. హనుమాన్ గుడి ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకుంటామని చెప్పారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ సూచించారు.