ప్రకాశం: సముద్రపు నీటితో విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక సాధన, ఉపయోగం, అభివృద్ధికి కేటాయించిన నిధులు, విద్యుత్ ప్లాంట్ల వల్ల పర్యావరణ ప్రభావంపై.. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి శ్రీపాద్ ఎస్సోనాయక్ సమాధానమిస్తూ.. సముద్ర నీటితో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని, ఇంతవరకు నిధులు కేటాయించలేదని చెప్పారు.