GNTR: జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయంపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. పాతగుంటూరు పరిధిలోని బుడంపాడులో 17 గ్రాముల మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఆరుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ముగ్గురిపై గతంలోనూ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధానికి కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.