కృష్ణా: కోడూరు శివారు ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై చాణిక్య పోలీస్ సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై నిన్న దాడి చేశారు.ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19,700/ నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు.