కృష్ణా: కంకిపాడు మండల పరిధిలోని కందలంపాడులో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ భావన్నారాయణ పాల్గొని రైతుల దగ్గర నుంచి పలు రకాల సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.