NDL: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన భారత్-ఆర్మేనియా దేశాల ద్వైపాక్షిక చర్చలకు హాజరయ్యే అవకాశం తనకు లభించినట్లు నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి హర్షం వ్యక్తం చేశారు. దౌత్య సంబంధాల బలోపేతం, వివిధ రంగాల్లో సహకారం, పరస్పర వృద్ధి, అభివృద్ధి అవకాశాలను అన్వేషించడంపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు ఎంపీ శబరి (X)లో పేర్కొన్నారు.