PLD: నరసరావుపేట పట్టణంలో వాహన తనిఖీలను వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ మంగళవారం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు కచ్చితంగా నిబంధన ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ వంటివి తీసుకోవాలన్నారు. త్రిబుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్లో ప్రయాణించటం నేరమన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. రూల్స్ పాటించి సహకరించాలని సీఐ విజయ్ చరణ్ కోరారు.