కడప: ముద్దనూరు మండలంలో శనివారం నిర్వహిస్తున్న బాల ఆధార్ క్యాంపులను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీఓ ముకుందా రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ బాల ఆధార్ నమోదు కోసం పిల్లల జన్మధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, చిన్న పిల్లలను తీసుకొని ఆయా కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బాల ఆధార్ నమోదు చేయించాలన్నారు.