AKP: ఎస్ రాయవరం మండలం వైసీపీ అధ్యక్షుడుగా ఎస్ఏఎస్ మధువర్మ నియమితులయ్యారు. నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నియమించినట్లు మధువర్మ ఆదివారం తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా వి. బంగారి,ఎం.రాజారావు,ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్,ఏ. నాగరాజును నియమించారు. కార్యదర్శులుగా సిహెచ్. అచ్యుతరావు నియమితులయ్యారు.