W.G: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులోని ఓ పూల దుకాణం వద్దకు ఆయన వచ్చారు. పూలను ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తుండటంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నారని అన్నారు.