NLR: సంగం మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు భారీగా కురిసాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొంగి పొర్లుతున్న వాగులను శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, సొసైటీ సాగునీటి సంఘాల సిబ్బంది పలువురు ప్రాంతాలను పరిశీలించారు. ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.