కృష్ణా: కార్తీకమాసం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి శనివారం ఒక్కరోజులో రూ.5,72,800 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఈరోజు తెలిపారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.