CTR: గుడిపల్లి మండలం కోడిగానిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గది పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడడంతో ఏడు మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థిని తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. విద్యార్థి తలకు ఐదు కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘటనపై గుడిపల్లి MEO సైతం పాఠశాలలో విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.