అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో రహదారిపై గత కొద్దిరోజులుగా అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్డు పక్కనున్న మురుగు.. డ్రైనేజీలా పొంగి రహదారిపైకి వస్తుండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారి రోగాలు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు.