KDP: పులివెందులలోని అంకాలమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆలయ అర్చకులు సురేశ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దర్శనానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.