PPM: వాణిజ్య సముదాయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పార్వతీపురం మున్సిపల్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి వ్యాపారులకు సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమంలో భాగంగా కొనుగోలుదారులకు ఇబ్బందు లేకుండా చూడాలన్నారు.