ప్రకాశం: కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జల వనరుల శాఖ ఆధ్వర్యంలో “నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత” పేరుతో 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సాగు నీటి సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నీటి వినియోగంలో బాధ్యత అవసరమని అధికారులు సూచించగా, సాగు నీటి సంఘాలు సమర్థంగా పని చేయాలన్నారు.