E.G: కడియంలోని వెంకట సూర్యథియేటర్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ వనుములమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా జాతరలో అమ్మవారి గరగలు, పలు సాంస్కృతిక నృత్యాలు అలాగే బుట్ట బొమ్మలు మొదలగు ప్రదర్శనలు ఉంటాయన్నారు. అనంతరం 15న అమ్మవారి తీర్థం జరుగుతుందన్నారు.