VSP: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కే.లోకనాధం బుధవారం ఆరోపించారు. అయితే, రాష్ట్ర కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్లు అసత్య ప్రచారం మానుకోవాలని తెలిపారు.