TPT: మామిడికాయలు పక్వానికి వచ్చాకే గుజ్జు తయారీ పరిశ్రమలకు తీసుకురావాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్.ఎస్.వెంకటేశ్వర్ రైతులకు సూచించారు. కేవీబీపురంలోని శ్రీదేవరాజ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కలెక్టర్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు.