SKLM: ఎచ్చెర్ల మండలం ఎం.కొత్తపేట–తోటపాలెం రహదారి పనులు గురువారం పూర్తవడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ప్రజలు MLA కు కృతజ్ఞతలు తెలిపారు.