ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన సీనియర్ నాయకుడు కురుబ మల్లన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో తనకు సముచితస్థానం కల్పించి, రాజకీయంగా ఎంతో ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.