పార్వతీపురం పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తూ ప్రకృతి వరంగా లభించిన వరహాలు గెడ్డను రాబందుల నుండి రక్షించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఆ పార్టీ ఓబీసీ జిల్లా ఛైర్మన్ వంగల దాలి నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డిని కలిసి వరహాల గెడ్డ కబ్జాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..ఇటీవల వరహాల గెడ్డను కొంతమంది ఆక్రమించారన్నారు.