AKP: నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. జలధార-జల హారతి కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం 100 రోజులు కొనసాగుతుందన్నారు.