SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ మొదలవలస చిరంజీవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.