NTR: ఈనెల 11నుంచి జరిగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించి చిత్రపటం అందజేశారు.