సత్యసాయి: మడకశిర సీఐ రాగిరి రామయ్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని గాయత్రి అనే మహిళ జిల్లా SP రత్నకు ఫిర్యాదు చేశారు. బంధువులతో జరిగిన గొడవ విషయంలో స్టేషన్కు వెళ్లగా సీఐ తనను గదిలోకి పిలిపించి మాట్లాడారని తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అంటూ అసభ్యంగా మాట్లాడారని వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.