E.G: కడియం మండలం దుళ్లలో గల శ్రీదేవి, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంబరాన్నంటాయి. శ్రీవారికి ప్రీతికరమైన గరుడ వాహనంపై దుళ్ల గ్రామ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు, ఉప సర్పంచ్ టి.శ్రీనివాస్లు పాల్గొన్నారు.