SKLM: ఆమదాలవలస పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు ధనుంజయరావును సన్మానించారు. విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయనను కమిటీ సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల ఈ సన్మాన కార్యక్రమాన్ని జరిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.