VSP: ఉత్తరాఖండ్ జాతీయ బీచ్ వాలీబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించి సాయి, బాబీ ఆదివారం విశాఖ చేరుకున్నారు. వారిని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడ పోటీలలో బంగారు పతకం సాధించి విశాఖకు మంచి పేరు తెచ్చుకున్నారని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు.