VZM: రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో జరుగుతున్న మజ్జి గౌరీ యాత్రను ఆదివారం రాజాం SHO అశోక్ కుమార్ పర్యవేక్షించారు. యాత్రలో ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర, అమ్మవారి గుడి వద్ద భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మూర్తి, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.