కోనసీమ: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సూక్ష్మ,చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మండపేట మండలం మారేడుబాకలో మహిఎంటర్ ప్రైజెస్, ఆద్విక డెకర్స్ పరిశ్రమను ఆదివారం MLA వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.