KRNL: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులతో శనివారం సందడిగా మారింది.సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం, మహాముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నది తీరాలు భక్తులతో భరితమయ్యాయి. వారు పుణ్యస్నానాలు చేసి మంచాలమ్మను దర్శించి స్వామి బృందావనంలో పూజలు చేశారు.