కృష్ణా: ముసునూరు మండలం రమణక్కపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్టు నుంచి ఎంపికైనట్లు పీడీ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రమణక్కపేట జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థినులు టి. నాగసుధ, డి. భార్గవిలు ఎంపికైనట్లు చెప్పారు. పిఠాపురంలో ఏపీ అండర్-16 రాష్ట్రస్థాయి యూత్ పోటీలు ఈనెల 11న జరుగుతున్నాయని అన్నారు.