HYD: గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. అలాగే ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరించాలని సూచించారు.